కడప /ప్రొద్దుటూరు : రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు శనివారం ప్రొద్దుటూరు పర్యటనలో భాగంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి గారు మంత్రివర్యులకు పూల బొకేలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మంత్రివర్యులతో పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువు టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
