దువ్వూరు :ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించకూడదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమం దువ్వూరులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి గారు నేతృత్వం వహించారు.
స్థానికంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై సంతకాలు చేశారు. ప్రభుత్వ వైద్య విద్య ప్రజల హక్కు అని, దాన్ని ప్రైవేట్ రంగానికి అప్పగించకూడదని వారు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా రఘురామిరెడ్డి మాట్లాడుతూ — వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని, వైద్య విద్యను అందరికీ అందుబాటులో ఉంచడమే పార్టీ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రజల విద్యా హక్కుపై దెబ్బ అని ఆయన పేర్కొన్నారు.కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, మహిళా నాయకులు, యువజన విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు.

