బీహార్కు చెందిన ప్రమాదకర సిగ్మా గ్యాంగ్ లోని నలుగురు గ్యాంగ్స్టర్లను దిల్లీ, బీహార్ పోలీసుల సంయుక్త టీమ్ ఎన్కౌంటర్ చేసింది. గురువారం తెల్లవారుజామున దిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. గురువారం తెల్లవారుజామున 2.20 గంటలకు దేశ రాజధానిలోని బహదూర్ షా మార్గ్లో ఉన్న డాక్టర్ అంబేద్కర్ చౌక్, పన్సాలీచౌక్లలో పోలీసుల టీమ్, సిగ్మా గ్యాంగ్ సభ్యుల మధ్య తుపాకీ కాల్పులు జరిగాయి. పోలీసుల ఎదురుకాల్పుల్లో రంజన్ పాఠక్ (25), బిమ్లేశ్ మహతో (25), మనీశ్ పాఠక్ (33), అమన్ ఠాకూర్ (21) హతమయ్యారు. వీరిలో అమన్ ఠాకూర్ దిల్లీలోని కరవల్ నగర్ వాస్తవ్యుడు. మిగతా ముగ్గురు గ్యాంగ్స్టర్లు బీహార్లోని సీతామర్హివాసులు….

