శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రగ్స్ పట్టివేత కలకలం రేపింది. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్కు చేరుకున్న ఓ మహిళా ప్రయాణికురాలిని డీఆర్ఐ అధికారులు తనిఖీ చేయగా, ఆమె వద్ద రూ.4.15 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి ఉన్నట్లు గుర్తించారు.
నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య రవాణా నెట్వర్క్పై అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు

