Tv424x7
Andhrapradesh

ఆదివారం బ్యాంకులకు సెలవు లేదు

అమరావతి : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదివారంతో ముగియనున్న వేళ … దేశంలోని అన్ని బ్యాంకులకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) కీలక ఆదేశాలు జారీచేసింది..ప్రభుత్వ లావాదేవీలు, ఇతరత్రా చెల్లింపులు, ట్యాక్స్‌ పేయర్లకు ఎలాంటి ఆటంకం లేకుండా శని, ఆదివారాల్లో సేవలు అందించాలంటూ … 33 బ్యాంకులకు ఆర్‌బిఐ ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలతో భారతీయ స్టేట్‌ బ్యాంకు (ఎస్‌బిఐ) సహా 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ సహా 20 ప్రైవేటు రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకు డిబిఎస్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌లు ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ సాధారణంగానే పనిచేస్తాయి. నెఫ్ట్‌, ఆర్‌టిజిఎస్‌తోపాటు చెక్‌ క్లియరెన్స్‌ వంటి సేవలు యథాతథంగా కొనసాగుతాయి..

Related posts

మాజీ మంత్రి విడదల రజినికి నోటీసులు

TV4-24X7 News

అమరావతిలో మరో కీలక అడుగు… ఏంటో తెలుసా…?

TV4-24X7 News

విల్లూరి జోన్ 3 కమీషనర్ శివ ప్రసాద్ కి సత్కారం

TV4-24X7 News

Leave a Comment