తెలుగు రాష్ట్రాల్లో వైద్య మండలి సభ్యులు పలు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో 50 మంది నకిలీ వైద్యులను గుర్తించారు…ఎనిమిది మంది సభ్యులు వేర్వేరు బృందాలుగా ఒకేసారి తనిఖీలు జరిపారు. నకిలీ వైద్యులు తమ ఆరోగ్య కేంద్రాల్లో రోగులను చేర్చుకుని పెద్ద సంఖ్యలో యాంటీబయాటిక్స్ ఇస్తున్నట్లు గుర్తించారు….తాము వైద్యులుగా పేర్కొంటూ బోర్డు పెట్టుకోవడమే కాక, వారికి అనుసంధానంగా మెడికల్ షాపులు, డయాగ్నొస్టిక్ సెంటర్లు కూడా పెట్టుకున్నారని అధికారులు తెలిపారు….. దాదాపు యాభై మంది నకిలీ వైద్యులపై ఎఫ్ఐఆర్లు నమోదు కాగా, ఇద్దరిని జైలుకు పంపినట్లు వెల్లడించారు…..
