అమరావతి: ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని వివిధ సమస్యలు, అభివృద్ధి అంశాలతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించేందుకు మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు, అభివృద్ధి అవసరాలు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను అక్టోబర్లోగా నిర్వహించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
Save or share this story as a newspaper-style Epaper Clip: