ఏపీ అప్పుడు ఏడాది మార్చి 31 నాటికి రూ.5,62,557 కోట్ల దాటుతాయని కేంద్రం లోక్ సభలో వెల్లడించింది. ఏపీ అప్పులు స్థూల దేశీయోత్పత్తి(GSDP)లో 34.7 శాతం ఉన్నట్లు ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో GSDPలో అప్పులు 34.58 శాతంగా ఉన్నాయన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి ఈక్విటీ పెట్టుబడి కల్పనలో భాగంగా ఎలాంటి ప్రైవేటురంగ భాగస్వామ్యాన్ని తీసుకోవడం లేదని కేంద్రం తెలిపింది.

previous post