కడప జిల్లా దువ్వూరు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు డాక్టర్. H.సురేష్ బాబు, డాక్టర్ వికసిత, డాక్టర్ రోషిని ఆధ్వర్యంలో ప్రపంచఆరోగ్య దినోత్సవము ర్యాలీ నిర్వహించారు 1950 సంవత్సరములో ప్రపంచఆరోగ్య సంస్థ ఏర్పడిందని 2025 సంవత్సరానికి “”ఆరోగ్య కరమైన ప్రారంభం -ఆశా జనక భవిషత్తులు “” అనే థిమ్ తో ముందుకు వెళ్లాలని తల్లి మరియు నవ జాత శిశువుల ఆరోగ్యం ఫై దృష్టి సారించి మరియు మహిళల దీర్ఘ కాలిక ఆరోగ్య శ్రేయస్సు ప్రధాన్యత ఇవ్వాలని ఏడాది పొడవున ప్రచారాన్ని ప్రారంభిస్తుందని తెలిపారు ప్రభుత్వం అందరికి సమానమైన నాన్యమైన ఆరోగ్య సంరక్షణకు పాటు పడుతుందని భారత దేశం ఆరోగ్య రంగంలో”” ఆయుష్మాన్ భారత్ ” మరియు “జాతీయ ఆరోగ్య మిషన్ ” వంటి కార్యక్రమం లు ద్వారా గణనీయ మైన పురోగతి సాధించిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి రాజగోపాల్ సూపర్ వైజర్ సువర్ణ, ఆసుపత్రి సిబ్బంది ఆశవర్కర్లు, పాల్గొన్నారు.

previous post
next post