బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలోని శ్రీ పోలేరమ్మ దేవస్థానం పనులలో జరిగిన అభివృద్ధి పనులలో అవినీతిపై అధికారులు విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని సీ.పి.యం పార్టీ మండల కార్యదర్శి గండి సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం స్థానిక సీ.పి.యం పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ….
బ్రహ్మంగారి మఠం మండల కేంద్రము లోని శ్రీ పోలేరమ్మ అమ్మవారు ఆలయంలో
1. ప్రహరి గోడ నిర్మాణము అంచనా వ్యయము – రూ॥69.5 లక్షలు
2. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణము అంచనా వ్యయము -రూ॥ 26 లక్షలు
3. వంట మరియు భోజనశాల నిర్మాణము అంచనా వ్యయము – రూ॥ 18.5 లక్షలు !
4. ముఖ ద్వారము అంచనా వ్యయము -రూ॥8.5 లక్షలు జరిగిన పనులలో భారీగా అక్రమాలు జరిగాయని ఆలయ పనుల్లో నాణ్యత లేదని చిన్న పటి వర్షానికి వస్తే అమ్మవారి ఆలయం ఆవరణ అంతా నీటి తో చెరువుల తలపిస్తుంది. అమ్మవారి దర్శనానికి వెళ్లాలంటే భక్తులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని భక్తులు తెలిపారు. గతంలో పనులు చేసే సమయంలో పనులలో నాణ్యత లోపించిందని సీ.పి.యం పార్టీగా పనులను అడ్డుకున్నామని వారు గుర్తుచేశారు. అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్షం వల్ల పనులు నాణ్యత లేకుండా చేసి భారీ స్థాయిలో అవినీతి అక్రమాలు జరిగాయని వారు తెలిపారు. పోలేరమ్మ ఆలయం పనులలో అక్రమాలపై ఉన్నతాధికారులు విచారణ జరిపి అధికారులు, కాంట్రాక్టర్ ల అవినీతి పాత్రపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.