Tv424x7
Andhrapradesh

పీలేరు పట్టణంలో బార్ అనుమతులపై మరోసారి డ్రామా…

పంచాయతీ పరిధిలో బార్ నడపడానికి ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించినా, వ్యాపారులు మాత్రం ముందుకు రాకపోవడం వార్తగా మారింది.

ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం నెలకు ₹35 లక్షలు నగదు రూపంలో చెల్లించాల్సి ఉండటమే వ్యాపారులు వెనుకడుగు వేయడానికి కారణమని చెబుతున్నారు. భారీ ఆర్థిక భారం భరించలేమంటూ ఎవరూ ముందుకు రావడం లేదు.

దీంతో ఎక్సైజ్ అధికారులు మాత్రం తిప్పలు పడుతున్నారు. టెండర్లలో పాల్గొనే వారే లేకపోవడంతో, ప్రభుత్వ ఆదాయానికి గండిపడే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

👉 స్థానికంగా అయితే, “పీలేరు వంటి పట్టణంలో ఇంత పెద్ద మొత్తం కట్టగల వ్యాపారి లేరు. అందుకే ఎవరూ బిడ్ వేయడం లేదు” అనే అభిప్రాయం వినిపిస్తోంది.

Related posts

గన్నవరం లో ఇండిగో విమానానికి తప్పిన ముప్పు

TV4-24X7 News

పోలేరమ్మ దేవస్థానం పనులలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలి: సీ.పి.యం పార్టీ మండల కార్యదర్శి గండి సునీల్ కుమార్

TV4-24X7 News

గుణదల మేరీ మాత ఉత్సవాలు ప్రారంభం

TV4-24X7 News

Leave a Comment