అమరావతి: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ భారీ ఏర్పాట్లు ప్రారంభించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని కీలక ప్రకటనలు చేశారు.
🔹 2026 జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అదే నెలలోనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి ఫలితాలు కూడా ప్రకటించనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
📌 కమిషన్ ఖరారు చేసిన గడువులు:
2025 అక్టోబర్ 15లోగా వార్డుల పునర్విభజన పూర్తి చేయాలి.
నవంబర్ 15లోగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలి.
నవంబర్ 30లోగా పోలింగ్ కేంద్రాలను ఖరారు చేయాలి.
డిసెంబర్ 15లోగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి.
ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన ఈవీఎంలను సిద్ధం చేయాలని ఈసీ ఆదేశించింది.