న్యూఢిల్లీ:కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ సంస్కరణలను *“ప్రజల సంస్కరణ”*గా అభివర్ణించారు. జీఎస్టీ రేట్ల తగ్గింపులు నేరుగా ధరల తగ్గింపుగా ప్రజలకు చేరేలా స్వయంగా పర్యవేక్షిస్తానని ఆమె స్పష్టం చేశారు.
ఆమె మాట్లాడుతూ, ఈ సంస్కరణలతో ప్రతి కుటుంబం ప్రయోజనం పొందుతుందని, వినియోగం పెరిగి ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు