హైదరాబాద్:
రాష్ట్ర రాజకీయాల్లో కొత్త కదలికలు మొదలయ్యాయి. బీసీ ఓటు బ్యాంక్ను ఆకర్షించేందుకు కొత్త పార్టీలు రంగంలోకి దిగుతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఓవైపు ప్రజాదరణ పొందిన యూట్యూబర్ తీన్మార్ మల్లన్న ఈ నెల 17న తన పార్టీ పేరును, జెండాను ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత కూడా స్థానిక సంస్థల ఎన్నికలలోపు పార్టీని ప్రకటించి, జెండా, ఎజెండాలను ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం.
🔸 ఇరువురి ప్రయత్నాల్లోనూ బీసీ ఓటర్లను తమవైపు తిప్పుకోవడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
🔸 రాబోయే ఎన్నికల్లో బీసీల ఓటు కీలకమవుతుందని భావించి పోటీగా ఈ రెండు కొత్త పార్టీలు రంగంలోకి రావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
అనూష