Tv424x7
Andhrapradesh

చిరంజీవిపై కోర్టుకెక్కిన మన్సూర్ అలీఖాన్ కు రూ.1 లక్ష జరిమానా

త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, త్రిషకు మద్దతు పలికిన చిరంజీవి, కుష్బూలపై పరువునష్టం దావా వేసిన తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ కు కోర్టు భారీ జరిమానా వడ్డించింది. త్రిషతో లియో సినిమాలో తనకు రేప్ సీన్ ఉంటుందని భావించానని, కానీ ఆ సీన్ మిస్సయిపోయిందంటూ మన్సూర్ అలీఖాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కశ్మీర్ షెడ్యూల్ లో మరీ దారుణంగా, సెట్స్ పై త్రిషను చూసే అవకాశం కూడా కల్పించలేదని చిత్రబృందంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలను చిరంజీవి, కుష్బూ తదితరులు తప్పు బట్టడమే కాకుండా, త్రిషకు సంఘీభావం ప్రకటించారు. దాంతో, మన్సూర్ అలీఖాన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. చిరంజీవి, కుష్బూ తనను మాటలతో వేధించారని పేర్కొన్నాడు. తన పరువుకు భంగం కలిగించారని, వారిద్దరూ చెరొక కోటి రూపాయలు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరాడు. అయితే, మద్రాస్ హైకోర్టు మన్సూర్ అలీఖాన్ వ్యాజ్యంపై మండిపడింది. పరువునష్టం దావా వేసినట్టు లేదు, పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది అంటూ అక్షింతలు వేసింది! ఈ క్రమంలో అతడి పిటిషన్ ను కొట్టివేసింది. కోర్టు అంతటితో వదిలిపెట్టలేదు. తమ సమయం వృథా చేశాడంటూ మన్సూర్ అలీఖాన్ కు రూ.1 లక్ష జరిమానా విధించింది. ఆ జరిమానాను అడయార్ కేన్సర్ ఇన్ స్టిట్యూట్ కు చెల్లించాలని ఆదేశించింది.

Related posts

భరోసా ఇచ్చిన బహిరంగ సభ..!!_

TV4-24X7 News

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని పోలీస్ కస్టడీకి అప్పగించిన కోర్టు

TV4-24X7 News

ఏపీ DSC పరీక్షలు వాయిదా వేసిన ప్రభుత్వం..కొత్త పరీక్ష తేదీలు ఇవే

TV4-24X7 News

Leave a Comment