విశాఖపట్నం /ప్రతి వేసవి సెలవుల్లో శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవ సంస్థ వారు సంస్థ ట్యూషన్ విద్యార్థులకు సమ్మర్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది.ఈ సంవత్సరం సమ్మర్ క్యాంపులో భగవద్గీత అధ్యయనం, పురాణ ఇతిహాసాలపై అవగాహన తరగతులు బోధించడం జరిగింది. ఈరోజు ఈ సమ్మర్ క్యాంపులు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులు, యువ నాయకులు ద్రోణం రాజు. శ్రీవత్సవ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు భగవద్గీత శ్లోకాలు అనర్గళంగా , చక్కగా చదివారు, వారికి ప్రముఖుల చేతుల మీదుగా చక్కటి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీవాత్సవ్ మాట్లాడుతూ, ప్రతి వేసవికాలంలోనూ విద్యార్థులకు సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తూ, సమ్మర్ క్యాంప్ లో భాగంగా విద్యార్థులకు భగవద్గీత అధ్యాయనాలు, పురాణ ఇతిహాసాలు, ఆధ్యాత్మిక యాత్రల ద్వారా భక్తి భావన పెంపొందించి, విద్యార్థులను మంచి మార్గంలో నడిపిస్తున్న సంస్థ వారికి అభినందనలు తెలియజేశారు. చివరగా విద్యార్థులకు స్నాక్స్ ని అందించి, ఈ కార్యక్రమానికి ముగింపు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు అప్పారావు విద్యార్థులు లక్ష్మి, హరిణి, నిఖిత, రక్షిత, జాహ్నవి, కీర్తి మరియు సమస్త మహిళా సభ్యులు పాల్గొన్నారు.

previous post