విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో స్వయంభూగా వెలసిన శ్రీ శ్రీ దుర్గాలమ్మ అమ్మవారికి దసరా లక్ష్మీదేవి అవతారం సందర్భంగా విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి సీతoరాజు సుధాకర్ మరియు 35వ కార్పొరేటర్ విల్లురి భాస్కరరావు ముఖ్య అతిథులుగా విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది వారు మాట్లాడుతూ అమ్మవారి దీవెనలు అమ్మవారి ఆశీస్సులు తో ప్రజలందరూ కూడా సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగినది. ఆ తదనంతరం 35 వ వార్డు కల్లుపాకలు ప్రాంతంలో గాజుల శ్రీను మిత్రబృందం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అమ్మవారి నవరాత్రి పందిరి దగ్గరకి విచ్చేసి అక్కడ కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది ఈ పూజ కార్య క్రమం లో వార్డ్ ప్రెసిడెంట్ బుచ్చ రాము టీడీపీ నాయకులు పాల్గొని జయప్రదం చేయడం జరిగినది.
