Tv424x7
Andhrapradesh

అనంతపురం లో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి

అనంతపురం రూరల్ సమీపంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. అనంతపురం రూరల్ చిన్నంపల్లి క్రాస్ సమీపంలో రాళ్ల లోడుతో వెళుతున్న లారీ టైరు పంక్చర్ కావడంతో పక్కకు నిలిపారు.**అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వెళుతున్న ఖాళీ ఐచర్ వాహనం వేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని వెనక వైపు నుంచి ఢీ కొట్టింది. దీంతో ఐచర్ వాహనంలో ఉన్న నలుగురు వ్యక్తుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతులు కర్ణాటకకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

Related posts

ఆదాయం దోచేసిన నువ్వు మద్యం పాలసీ గురించి మాట్లాడుతున్నావా జగన్ ? మద్య నిషేధం అని చెప్పి పాలసీలు మార్చి దోచేశారు

TV4-24X7 News

అనంతపురం కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ను … కొల్లగొట్టారా …❓

TV4-24X7 News

విజయవాడ ధర్నా చౌక్ లో తీవ్ర ఉద్రిక్తత.. అంగన్ వాడీల అరెస్టుకు యత్నం

TV4-24X7 News

Leave a Comment