Tv424x7
National

తమిళనాడులో మరోసారి భారీ వర్షాలు

చెన్నై:తమిళనాడులో మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆదివారం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసాయి.నాగపట్నంలో అయితే ఏకంగా 16.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఆదివారం ఉదయం 8.30 గంటల నుండి జనవరి 8 ఉదయం 5.30 గంటల వరకు 16.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. కరైకల్ (12.2 సెం.మీ.), పుదుచ్చేరి (9.6 సెం.మీ.), కడలూరు (9.3 సెం.మీ.), ఎన్నూర్ (9.2 సెం.మీ.)లో భారీ వర్షపాతం నమోదైంది.కడలూరు, కోయంబత్తూరు, తంజావూరు, కాంచీపురం, దిండిగల్, విల్లుపురం, మైలాడుతురై, నాగపట్నం, వెల్లూరు, రాణిపేట్, తిరువణ్ణామలై, తిరువారూర్, కళ్లకురిచ్చి, చెంగల్‌పట్టు, కన్యాకుమారి సహా 18 జిల్లాలో ఆదివారం భారీ వర్షం కురిసింది. నేడు కూడా తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దాంతో చెంగల్ పట్టు, కన్యకూమారి, తిరవళ్ళూరు సహా ఆరు జిల్లాలో నేడు స్కూల్స్‌కు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

Related posts

చైనా సరిహద్దుల్లో ఛత్రపతి శివాజీ విగ్రహం

TV4-24X7 News

త్వరలోనే పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు!

TV4-24X7 News

రేపు మ.12 గంటలకు అయోధ్యలో అద్భుతం

TV4-24X7 News

Leave a Comment