విశాఖపట్నం : విశాఖ దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశంపార్టీ ఇంచార్జ్ సీతంరాజు సుధాకర్ ని కలిసి తమ సమస్యలని విన్నవించుకుంటూ ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సమస్యలపై సానుకూలంగా స్పందించిన సీతంరాజు సుధాకర్ ఈ సమస్యలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత తొందరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 35వ వార్డ్ కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు, ఆటోనగర్ కార్యవర్గ ప్రెసిడెంట్ ఖాజావలి, వైస్ ప్రెసిడెంట్ గౌరీ శంకర్, సెక్రటరీ షేక్ రియాజ్ ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
