సీతాం రాజు సుధాకర్ మరియు విల్లూరి చేతుల మీదగా పేదలకు చీరలు పంపిణీ
విశాఖపట్నం విశాఖ దక్షిణ నియోజకవర్గం 35 వ వార్డు పరిధిలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ముఖ్య అతిధి విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు ఎన్టీఆర్ రాష్ట్ర వైద్య సేవ చైర్మన్ రాజు సీతాం రాజు సుధాకర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆయన చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించడo జరిగినది 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు వార్డు ప్రెసిడెంట్ బొత్స రామిరెడ్డి మరియు టిడిపి వార్డ్ నాయకులు కలిసి పేదలకు చీరలు పంపిణీ చేయడం జరిగినది వారు మాట్లాడుతూ రాష్ట్రం లో రాజకీయ పరిజ్ఞానం లేని నాడు పేద బడుగు బలహీన వర్గాలకు సరైన గూడు కూడు ఇవ్వాలని తన చైతన్య రథంతో రాజకీయ చైతన్యాన్ని తీసుకు వచ్చిన మహోన్నత నాయకుడు ఉమ్మడి ఆంధ్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం చేసి నేటికీ 43 సంవత్సరాలు పూర్తిఅయిన సందర్భము గా బీసీలకు మొదటి ప్రాధాన్యతనిస్తూ బీసీలను పదవులు ఇచ్చి పట్టాభిషేకం చేస్తున్న నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఆయన నాయకత్వంలో మనమంతా రాబోయే రోజుల్లో ఇంకా తెలుగు దేశం పార్టీని బలోపేతం చేయాలని మాట్లాడటం జరిగినది.