అమరావతి :ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన వైద్యారోగ్యశాఖ సమీక్ష ముగిసింది. ఈ సమావేశంలో ప్రతినియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటుకు కార్యాచరణ ప్రకటించారు. అవసరాన్ని బట్టి పీహెచ్సీ, సీహెచ్సీలో వర్చువల్ వైద్యసేవలు అందించాలని అన్నారు. కొత్తగా రాష్ట్రంలో 13 కొత్త డీ-అడిక్షన్ సెంటర్లు స్థాపించాలని చంద్రబాబు వైద్యాధికారులను ఆదేశించారు. అమరావతి మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు.
