ఏపీ రాష్ట్రంలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లు విలీనమై మే 1 నుంచి ‘ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్’గా సేవలను అందించనున్నాయి. ఈ విషయాన్ని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ చైర్మన్ సత్యప్రకాష్ సింగ్ తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ రూ.23,667 కోట్ల డిపాజిట్లు, రూ.27,090 కోట్ల రుణాలతో కలిపి మొత్తం రూ.50,757 కోట్లతో అగ్రగామిగా నిలిచిందన్నారు.
