ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్కు భారత్ గట్టి సమాధానం ఇస్తోన్న విషయం తెలిసిందే. ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా 9 ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో సుమారు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం. అయితే పాకిస్తాన్కు టర్కీ, అజర్బైజాన్ మద్దతు తెలిపాయి. టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ “పౌరులను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడులను ఖండిస్తున్నాం. భారత చర్యల వల్ల యుద్ధ పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది” అని పేర్కొంది.
