నాగుల గుట్ట పల్లి లో పోలీసుల పల్లెనిద్ర
ప్రజలతో పోలీసులు స్నేహంగా మెలిగేందుకు పల్లెనిద్ర దోహదం- ఆర్కే సీఐ గోవింద రెడ్డి
చక్రాయపేట మండలంలోని సురభి నాగుల గుట్ట పల్లి లో శనివారం రాత్రి పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌసల్ ఆదేశాల మేరకు ఆర్కే వ్యాలీ సి ఐ గోవింద రెడ్డి పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేసి, ప్రజా సమస్యల్ని తెలుసుకున్నారు. ప్రజలతో పోలీసులు స్నేహంగా మెలిగేందుకు పల్లెనిద్ర దోహదపడుతుందని తెలిపారు. అలాగే గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల కర్తవ్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో , సిబ్బంది పాల్గొన్నారు.
