Tv424x7
Telangana

10వ, 12వ తరగతుల సీబీఎస్సీ బోర్డు పరీక్షల షెడ్యూల్‌ 2024 విడుదల

హైదరాబాద్‌, డిసెంబర్‌ 12: పదో తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్‌-2024ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్సీ) మంగళవారం (డిసెంబర్‌ 12) విడుదల చేసింది. 10వ, 12వ తరగతుల బోర్డు పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానున్నాయి. 10వ తరగతి ఫైనల్‌ పరీక్షలు ఫిబ్రవరి 15వ తేదీన ప్రారంభమై మార్చి 13తో ముగుస్తాయి. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15వ తేదీన ప్రారంభమై ఏప్రిల్‌ 2వ తేదీతో ముగుస్తాయని ఎగ్జాం కంట్రోలర్ సన్యాం భరద్వాజ్‌ తెలిపారు10వ, 12వ తరగతుల బోర్డు పరీక్షలు మొదటి రోజు (ఫిబ్రవరి 15) రెండు సెషన్లలో జరుగుతాయి. మొదటి సెషన్‌ పరీక్ష ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతుంది. రెండో సెషన్‌ పరీక్ష ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరుగుతుంది. ఇతర రోజులలో ఒకటి, రెండు, మూడు, నాలుగు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) వంటి పోటీ పరీక్షల తేదీలను పరిగణనలోకి తీసుకుని 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ను రూపొందించినట్లు ఎగ్జాం కంట్రోలర్ జోడించారు.గతేడాది 10వ తరగతి బోర్డు పరీక్షలకు మొత్తం 21,658,05 మంది అభ్యర్థులు హాజరుకాగా వారిలో 20,167,79 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. 93.12 శాతంగా ఉత్తీర్ణత నమోదైంది. ఇక గతేడాది 12వ తరగతి బోర్డు పరీక్షలకు మొత్తం 16.9 లక్షల మంది అభ్యర్థులు హాజరుకాగా.. వారిలో 7.4 లక్షల మంది బాలికలు, 9.51 లక్షల మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు. 12వ తరగతికి సంబంధించి మొత్తం ఉత్తీర్ణత శాతం 87.33 శాతంగా ఉంది. 99.91 శాతం ఉత్తీర్ణతతో త్రివేండ్రం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది.

Related posts

తెలంగాణలో నాలుగు రోజులు భారీవర్షాలు..పది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్…!!_

TV4-24X7 News

_ఫలితాలకు మిగిలింది 5 రోజులే.. పార్టీలు మారిన నేతల్లో ఉత్కంఠ_

TV4-24X7 News

A.P & T.S Live Update News

TV4-24X7 News

Leave a Comment