శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో రైల్వే స్టేషన్ సమీపన గుర్తు తెలియని వ్యక్తులు ఒక వ్యక్తిని గురువారం సాయంత్రం హత్య చేసి, పారిపోయారు. మృతుడు తలారి లోకేంద్ర తండ్రి పేరు భైరవుడు ధర్మవరం పట్టణం కేతిరెడ్డి కాలనీ ఎల్2 కు చెందిన వ్యక్తిగా సమాచారం. తల్లిదండ్రులు బొప్పాయ కాయలు బండి మీద అమ్ముకుంటూ జీవనం సాగిస్తారని తెలిసింది.కాగా మృతుడు గతంలో పలు కేసులలోనూ ఒక మహిళను చంపిన కేసులో కూడ నిందితుడుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

previous post