Tv424x7
Andhrapradesh

రేవంత్‌ను కలిసిన గూగుల్ వైస్ ప్రెసిడెంట్

హైద్రరాబాద్: గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట గురువారం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులపై రేవంత్‌తో చంద్రశేఖర్‌ చర్చించి ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు..తెలంగాణ పౌరుల అవసరాలను తీర్చడానికి నాణ్యమైన సేవలను అందించడానికి విస్తృత సాంకేతికత, నైపుణ్యం తమ వద్ద ఉందని చంద్రశేఖర్ వివరించినట్టుగా తెలుస్తోంది. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి సాధ్యమయ్యే రహదారి భద్రతపై కూడా ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు..

Related posts

ఆవుల అక్రమ రవాణాన్ని అడ్డుకున్న మంగళగిరి రూరల్ పోలీసులు

TV4-24X7 News

సూరాడ రాజు ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం

TV4-24X7 News

వైకాపా శ్రేణులారా…? కాంగ్రెస్ లోకి తిరిగి రండి. జగన్ ఓటమి పక్క

TV4-24X7 News

Leave a Comment