నెల్లూరు జిల్లాలోని సైదాపురం గ్రామానికి చెందిన శిరీష (17)అనే యువతి గూడూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన కోలా జశ్వంత్ (21) అనే యువకుడు గూడూరులో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అతను శిరీషను తరచూ వేధించేవాడు. ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బుధవారం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో ఇంటికి వచ్చిన శిరీష మనస్తాపానికి గురై ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

previous post