Tv424x7
Andhrapradesh

ఈ నెల 11 నుంచి లోకేశ్‌ ‘శంఖారావం’.. ఇచ్ఛాపురంలో తొలి సభ

అమరావతి: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈ నెల 11 నుంచి శంఖారావం పేరిట ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు ‘శంఖారావం’పై రూపొందించిన ప్రత్యేక వీడియోను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విడుదల చేశారు..ఉత్తరాంధ్ర నుంచి ‘శంఖారావం’ ప్రారంభం కానుందని, యువగళం పాదయాత్ర జరగని ప్రాంతాల్లో పర్యటించేలా ప్రణాళికలు ఉంటాయన్నారు. ”ప్రజలు, పార్టీ శ్రేణుల్లో చైతన్యం నింపడమే ‘శంఖారావం’ లక్ష్యం. రోజూ 3 నియోజకవర్గాల్లో పర్యటన ఉంటుంది. సుమారు 50 రోజుల పాటు కొనసాగుతుంది. ఇచ్ఛాపురంలో ఈ నెల 11న తొలిసభ నిర్వహిస్తాం. జగన్‌ పాలనలో మోసపోయిన వారికి భరోసా కల్పిస్తాం” అని అచ్చెన్న తెలిపారు.

Related posts

వివేకా పీఏ ఇంటికి పోలీసులు.. వాంగ్మూలం నమోదు

TV4-24X7 News

నేడు అసెంబ్లీలో పలు కీలక అంశాలపై చర్చ..!

TV4-24X7 News

వైసీపీ నేతల భార్యలపై పోస్టులు పెట్టినా వదలను: సీఎం

TV4-24X7 News

Leave a Comment