మైలవరం జలాశయం పరిధి లో ఉన్న కోగటం ఎర్రగుడి పడు, పందిళ్ళ పల్లె, యర్రగుంట్ల, గ్రామాలలో ఉన్న రైతులు నాకు నిత్యం ఫోన్ చేసి తమ సమస్య ని చెపుతున్నారు సమస్య ఏమంటే వర్షాలు లేని కారణం గా ఆ గ్రామాల్లో కొర్ర ఎక్కువ గా పండిచడం జరిగింది…… సాగు నీరు లేక పంట ఎండి పోయే పరిస్థితి ఉంది.
మైలవరం జలాశయం నుండి నీళ్లు వదలాలని రైతులు విన్నవించడం జరిగింది.మరియు అదే మాదిరి గానే KC కెనాల్ ఆయకట్టు పరిధిలో నువ్వులు, కొర్ర, వేశారు.ఆరుతడి పంటల కోసం KC కెనాల్ కి నీళ్లు వదలాలని కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.దీని పై కలెక్టర్ సానుకూలంగా స్పందించి రెండు రోజులలో సమస్యకు పరిష్కారం చేస్తానని చెప్పడం జరిగింది.. రైతుకు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడిగా తాను అండగా ఉంటానని ఇరగం రెడ్డి తిరుపాల్ రెడ్డి చెప్పడం జరిగింది…..