Tv424x7
Andhrapradesh

నంద్యాల రైల్వే స్టేషన్ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ

శిలాఫలకాలను ఆవిష్కరించిన ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి

అమృత భారత్ రైల్వే స్టేషన్ల నిర్మాణానికి దేశంలోని 554 రైల్వే స్టేషన్లకు నేడు ప్రధాని మోడీ డిజిటల్ ప్రక్రియ ద్వారా శంకుస్థాపన చేశారు.ఇందులో భాగంగా నంద్యాల రైల్వే స్టేషన్ ఆధునీకరణకు కూడా నేడు శంకుస్థాపన జరిగింది.దీనికోసం నంద్యాల రైల్వే స్టేషన్ లో ఏర్పాటుచేసిన ఒక ఆకర్షణీయ కార్యక్రమంలో డిజిటల్ వేదిక ద్వారా ప్రధాని మోడీ ప్రసంగించి రిమోట్ ద్వారా ఆవిష్కరించారు.గుంటూరు నుండి వచ్చిన సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజనీర్ శ్రీ హర్ష అధ్యక్షతన జరిగిన సభా కార్యక్రమానికి నంద్యాల పార్లమెంట్ సభ్యులకు శ్రీ పోచా బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సంబంధిత శిలా ఫలకాలను ఆవిష్కరించారు.తన పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన వెంటనే నంద్యాల కాచిగూడ రైలు వేళలు మార్పు కోసం కృషి చేసి సాధించాననీ, ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి నంద్యాల తిరుపతి ప్రత్యేక రైలు అన్ని సౌకర్యాలతో సాకారం అయ్యేలా కృషి చేశానని, అలాగే అమృత భారత పథకంలో నంద్యాల ను చేర్చడానికి తన వంతు కృషి చేశానని, నంద్యాల రైల్వే స్టేషన్ అభివృద్ధికి తన సేవలు నిరంతరంగా కొనసాగుతాయని తెలిపారు.కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మెడా మురళీధర్, డాక్టర్ ఇంటి ఆదినారాయణ, అభిరుచి మధు తదితరులు పాల్గొని నంద్యాల రైల్వే స్టేషన్ అభివృద్ధి పట్ల హర్షం వ్యక్తం చేశారు.దాదాపు 800 కు పైగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనగా స్థానిక గురురాజా విద్యా సంస్థల చిన్నారులు ప్రదర్శించిన ఆకర్షణీయమైన నృత్యాలు, సంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి.అత్యంత విజయవంతమైన ఈ కార్యక్రమం నిర్వహణలో టెలికం ఇంజనీర్ పవన్ కుమార్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ చంద్రశేఖర్, వాణిజ్య శాఖ కమర్షియల్ ఇన్స్పెక్టర్ షా మొహమ్మద్, నాగమణి, రవి ప్రకాష్, ఇంజనీరింగ్ విభాగం ఇంజనీర్ వెంకయ్య, ఆర్పిఎఫ్ సిబ్బంది, చీఫ్ క్రూ కంట్రోలర్ రవి ప్రకాష్, రైల్వే డాక్టర్ ప్రియదర్శిని హెల్త్ ఇన్స్పెక్టర్ రంగస్వామి తదితరులు కృషి చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో రైల్వే సూపర్వైజర్లు సుబ్బారావు, కొండబాబు, సుధాకర్ రావు, రామన్న ,జవహర్ రెడ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు

Related posts

దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు.. సౌత్ ఇండియాలో 19 చోట్ల తనిఖీలు

TV4-24X7 News

శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల నిర్వహణ కేబీఆర్‌ఎంబీ అప్ప‌గింత

TV4-24X7 News

మానవసావే మాధవసేవంటున్న వన్ టౌన్ సీఐ జీడీ బాబు

TV4-24X7 News

Leave a Comment