మైదుకూరులో యువత–విద్యార్థి ర్యాలీ లోగో ఆవిష్కరణ

 

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

కడప /మైదుకూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో యువత–విద్యార్థి ర్యాలీ లోగోను మైదుకూరు మాజీ శాసనసభ్యులు, క్రమశిక్షణ కమిటీ చైర్మన్  శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో మైదుకూరు విద్యార్థి విభాగం అధ్యక్షుడు భూమిరెడ్డి బాలకృష్ణారెడ్డి, మైదుకూరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు చంద్ర ఓబుల్ రెడ్డి, జిల్లా వాలంటరీ విభాగం ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రశాంత్ రెడ్డి, రాయుడు పాల్గొన్నారు.

అదేవిధంగా మైదుకూరు పట్టణ అధ్యక్షుడు ఏపీ లింగన్న, మైదుకూరు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మూలే భరత్ కుమార్ రెడ్డి, షరీఫ్, 6వ వార్డు నాయకుడు షరీఫ్, మండల కన్వీనర్ నరసింహారెడ్డి, మైదుకూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మాబుచన్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొని యువత–విద్యార్థి ర్యాలీ విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *