హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కొత్త సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీకి సన్నాహాలు ప్రారంభించింది. ఆగస్టు 15న కొత్త పెన్షన్లను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.మొత్తం రెండున్నర లక్షల కొత్త పెన్షన్లను మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. తొలి దశలో సింగిల్ మహిళలు, వితంతువులకు కొత్త పెన్షన్లు అందించనున్నట్లు సమాచారం.
హైదరాబాద్లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త పెన్షన్లను లబ్ధిదారులకు అందజేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.