కడప /వల్లూరు మండలం, కొప్పోలు గ్రామానికి చెంది ప్రస్తుతం కడప నగరం లోని రాఘవేంద్ర టౌన్ షిప్ లో కాపురం ఉండే పుత్తా వెంకట రెడ్డి (76) శనివారం సాయంత్రం మృతి చెందారు. వైసిపీ నేత, ఏపీ ఎస్ ఆర్టీసీ మాజీ జోనల్ చైర్మన్ రెడ్యo వెంకట సుబ్బారెడ్డి, రెడ్యo ఆది నారాయణ రెడ్డి, కేసీ కెనాల్ ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ రెడ్యo చంద్రశేఖర్ రెడ్డి లు పుత్తా వెంకట రెడ్డి మృతదేహం పై పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించి సంతాపం వ్యక్త పరిచారు. కుటుంబం సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి ఓదార్చారు.మంచి మనిషి మా బంధువు వెంకట రెడ్డి మృతి భాధించిందన్నారు. వారి కుటుంబం కు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ధైర్యం, స్టైర్యం, మనో నిబ్బరాన్ని ఇవ్వాలని ప్రార్ధించినట్లు రెడ్యo తెలిపారు.*

previous post