Tv424x7
Andhrapradesh

డీజీపీ, ఇంటెలిజెన్స్ ఏడీజీలతో సీఎస్ జవహర్ రెడ్డి అత్యవసర భేటీ

అమరావతి: సచివాలయంలో డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా, ఇంటెలిజెన్స్‌ ఏడీజీ కుమార్‌ విశ్వజిత్‌లతో సీఎస్‌ జవహర్‌రెడ్డి భేటీ అయ్యారు. ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్‌ కావటంతో అధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు..గురువారం ఈసీ వద్ద వివరణ ఇచ్చేందుకు సీఎస్‌, డీజీపీలు దిల్లీ వెళ్లనున్నారు. ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు జరిగేలా పాలనా వ్యవస్థ విఫలం కావడానికి కారణాలేమిటని ఈసీ ప్రశ్నించింది. ఘటనలకు బాధ్యులు ఎవరు? నివారణ చర్యలు ఏం తీసుకున్నారని సీఎస్‌, డీజీపీలను ఈసీ వివరణ కోరింది. ఈ అంశాలపై చర్చించేందుకు డీజీపీ, సీఎస్‌, ఇంటెలిజెన్స్‌ ఏడీజీలు అత్యవసరంగా భేటీ అయ్యారు..

Related posts

కళ్ళ ముందే భర్త హత్య…మనస్థాపనతో భార్య మృతి

TV4-24X7 News

మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 144 సెక్షన్

TV4-24X7 News

అనకాపల్లి జిల్లాలో డయేరియా కలకలం

TV4-24X7 News

Leave a Comment