ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవం అనంతరం డిశ్చార్జి సమయంలోనే జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు అధికారులను ఆదేశించారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి సంబంధించి అమల్లోకి వచ్చిన కొత్త విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ పోర్టల్ ద్వారా పత్రాలు ఎక్కడైనా, ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

previous post
next post