Tv424x7
Andhrapradesh

ఎందుకు ఓడిపోయాం..! ఏమైంది..?

వైసీపీ నేతలతో కారణాలు విశ్లేషిస్తున్న జగన్_ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైఎస్సార్సీపీ సమీక్ష సమావేశం నిర్వహిస్తోంది. తాడేపల్లిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను ఆ పార్టీ నేతలు కలిశారు. వారిలో సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని ఉన్నారు. భవిష్యత్తు కార్యాచరణ పై చర్చిస్తున్నారు. ఓటమి గల కారణాలపై విశ్లేషించుకుంటున్నారు.జగన్‌ను కలవడానికి వచ్చిన వారిలో మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు, అరకు, పాడేరు ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఉన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేసినప్పటికీ ఘోరంగా ఓడిపోవడంపై వైసీపీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు

Related posts

ఇంటర్మిడియట్‌లో కొత్త సిలబస్‌

TV4-24X7 News

మాజీ సీఎంతో వాసుపల్లి భేటీ

TV4-24X7 News

కొత్త వంగడాన్ని సృష్టించిన మహిళా శాస్త్రవేత్త

TV4-24X7 News

Leave a Comment