వైసీపీ నేతలతో కారణాలు విశ్లేషిస్తున్న జగన్_ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైఎస్సార్సీపీ సమీక్ష సమావేశం నిర్వహిస్తోంది. తాడేపల్లిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ను ఆ పార్టీ నేతలు కలిశారు. వారిలో సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని ఉన్నారు. భవిష్యత్తు కార్యాచరణ పై చర్చిస్తున్నారు. ఓటమి గల కారణాలపై విశ్లేషించుకుంటున్నారు.జగన్ను కలవడానికి వచ్చిన వారిలో మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు, అరకు, పాడేరు ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఉన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేసినప్పటికీ ఘోరంగా ఓడిపోవడంపై వైసీపీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు

previous post
next post