Tv424x7
Telangana

భూదాన్ పోచంపల్లి ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

యాదాద్రి జిల్లా:యాదాద్రి భువనగిరి జిల్లా లో గురువారం తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భూదా న్ పోచంపల్లి మండల పరిధి లోని దోతిగూడెం గ్రామంలో ని విత్తనాలు ఉత్పత్తి చేసే కంపెనీలో షాట్ సర్క్యూ ట్‌తో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. అయితే, ఆ మంటలు కాస్త ఫ్యాక్టరీలో వ్యాపించడంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. గమనించిన కంపెనీ సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచార అందజేయగా వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో ఎవ రు కంపెనీలో లేకపోవడం తో పెనుప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో రూ.లక్షల్లో ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చిన కంపెనీ సిబ్బంది తెలిపారు.

Related posts

జాతీయ మానవ హక్కుల కమిషన్ లో (ఎన్ హెచ్‌ఆర్‌సి) నర్సింహులపేట ఎస్ఐ సతీష్ పై కేసు నమోదు

TV4-24X7 News

గూడూరులో తల్లి, కుమారుడి దారుణ హత్య

TV4-24X7 News

క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక దంపతుల ఆత్మహత్య

TV4-24X7 News

Leave a Comment