విశాఖపట్నం వన్ టౌన్ నందు ఉన్న శ్రీ స్వామి వివేకానంద సంస్థలో ప్రతి నెల రెండవ గురువారం ఉచితంగా బి .పి , షుగర్ వైద్య సేవలు నిర్వహిస్తున్నారు. ఈరోజు వైద్య శిబిరంలో డాక్టర్. సూర్య తేజ పర్యవేక్షణలో వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ, అందరూ ఆరోగ్య పట్ల జాగ్రత్తగా ఉండాలని, క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలని, తగిన వ్యాయామం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ నాయుడు, పుండరీ కాక్షయ్య , కమల ప్రియ , మౌనిక, సాయి, రవి పాల్గొన్నారు.

previous post