విశాఖపట్నం వాల్తేర్ రాయల్ రౌండ్ టేబుల్ సంస్థ వారు ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రిలో, దూర ప్రాంతాల నుండి వచ్చిన పేషంట్ల సహాయకులకు, 10 రూపాయలకే రుచికరమైన, శుభ్రమైన భోజనాలను శ్రీ స్వామి వివేకానంద సంస్థ వారి ఆధ్వర్యంలో ప్రతిరోజు పంపిణీ చేస్తున్నారు. ఈరోజుతో 356 రోజులు ఈ భోజనాలు పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. ఈ సందర్భంగా ఆంధ్ర ,తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల రౌండ్ టేబుల్ సంస్థ చైర్మన్ మక్సుద్ అహ్మద్ మాట్లాడుతూ, దూరప్రాంతాల నుండి వచ్చిన పేషంట్ల సహాయకులకు భోజనాలు అవసరం చాలా ఉందని, రౌండ్ టేబుల్ సంస్థ సభ్యుల సహకారంతో10 రూపాయలకే భోజనాలు అందించడం జరుగుతుందని, ఈ భోజనాలను ముందు ముందుకి కొనసాగిస్తామని, ఆయన తెలియజేశారు. అన్నదాన కార్యక్రమాలు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సంస్థ వారిని వివేకానంద సంస్థ వారు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రౌండ్ టేబుల్ సంస్థ సభ్యులు కళ్యాణ్ ఆదిత్య, భరత్ కొ ల్లపూడి .మొదలైన వారు పాల్గొన్నారు.

previous post