Tv424x7
Andhrapradesh

ఆషాఢమాసంలో,గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా…?

🙏🌳సీతాదేవి లంకలోని అశోకవనంలో తానుంతకాలం ప్రతి రోజు తన కష్టాలను గోరింటాకు చెట్టుతో చెప్పుకున్నదట. రావణ సంహారం అనంతరం అయోధ్యకు తిరిగి వెళ్లేటప్పుడు ఈ గోరింటాకు చెట్టుకు తాను ఏదైనా చేయాలని అనుకున్నదట. ఇందులో భాగంగానే సీతమ్మ గోరింటాకు చెట్టును వరం కోరుకోమంది.

🙏🌳అయితే గోరింటాకు చెట్టు మాత్రం తనకు ఎలాంటి వరాలొద్దని చెప్పింది. ప్రస్తుతం నీ మోము ఎలా సంతోషంతో కళకళలాడుతుందో.. సీతమ్మలాగానే లోకంలోని మహిళలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించింది. అందుకు గోరింటాకు నిజాయితీకి సీతాదేవి మెచ్చి.. గోరింటాకు చెట్టుకు ఓ వరం ఇచ్చింది.

🙏🌳 ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరింటాకు మానవలోకంలో ప్రసిద్ధి చెందుతుంది. తనవర్ణం వలన చేతులకు, కాళ్లకూ అందాన్నిచ్చేఅలంకారవస్తువుగా వాడబడుతుంది. ముఖ్యంగా ఆషాడమాసంలో ఈ గోరింటాకు పెట్టుకోవడం వలన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని అదే ఈచెట్టుజన్మకు సార్ధకత అని చెప్పిందట.

🙏🌳అందరూ గోరింటాకుచెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్లూ అందంగా తీర్చుకుంటు ఉంటారు అని వరం ఇచ్చింది.

🙏🌳ఆసమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది. నుదుటన కూడా‌ఈ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో..నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని సీతమ్మతో ఆసందేహం చెప్పగా…. నుదుటన గోరింటాకు పండదు అంటుంది….కావాలంటే చూడండీ గోరింటాకు నుదుటన పండదు.

🙏🌳పెద్దోళ్ళు ఏంచెప్పినా దూరదృష్టితోనే చెబుతారండీ. గోరింటాకు చెట్టును ఆషాడమాసంలో ఎవరు ప్రార్థిస్తారో.. వారి చేతుల్లో గోరింటాకు పెట్టుకుంటారో.. వారికి సకలసంపదలు, సుఖసంతోషాలు చేకూరుతాయి. వారి జీవితం సంతోషకరంగా ఉంటుందని చెప్తుంది.

🙏🌳 అందుకే ఆషాడ మాసంలో గోరింటాకును మహాలక్ష్మీదేవిని ధ్యానించి చేతులు పండేంతగా పెట్టుకుంటే.. మహిళలకు ఎలాంటి కష్టాలుండవని.. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి.

🙏🌳 “ఆషాడమాసం ” లో చేతులకు గోరింట పెట్టుకోవడం ఒక ఆచారంగా మన సమాజంలో స్థిరపడింది. అలంకరణలో భాగమని భావించినా, దీని వెనుక ఎన్నో ప్రత్యేకతలు దాగి ఉన్నాయి. గోరింటాకు మహిళల చేతులకూ, పాదాలకూ అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఇదేదో అలంకరణ కోసం తెచ్చిన ఆడంబరం కాదు.

🙏🌳 గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

🙏🌳 ఆషాఢ మాసంలో వాతావరణ ప్రభావం వల్ల అనేక సూక్ష్మ క్రిములు వ్యాపిస్తూ ఉంటాయి.

🙏🌳 వానల రాకతో గాలిలో, నీటిలో వీటి శాతం ఎక్కువగా ఉంటుంది.

🙏🌳తేమలో ఉండే సూక్ష్మ క్రిముల ప్రభావం చేతులు ద్వారా, పాదాల ద్వారా చర్మ రంధ్రాలగుండా శరీరంలో ప్రవేశించకుండా గోరింటాకు కవచంగా పనిచేస్తుంది.

🙏🌳అంతేకాదు, గోరింటాకు ఒత్తిడిని, వేడిని తగ్గిస్తుంది. స్త్రీ అరచేతి మధ్యలో గర్భాశయా నికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి.

🙏🌳గోరింటాకు ఆ నాడుల్లో ఏర్పడే అతి ఉష్ణాన్ని లాగేస్తుందని, తద్వారా గర్భాశయ దోషాలు తొలగిపోతాయని చెబుతున్నది ఆయుర్వేదం

Related posts

వైసీపీ నుంచి ముగ్గురు – రాజ్యసభలో టీడీపీ తొలిసారి “ఖాళీ”.

TV4-24X7 News

15 ఎకరాల అటవీ భూమిలో గంజాయి సాగు.. ధ్వంసం చేసిన పోలీసులు..

TV4-24X7 News

అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎస్పీ, కలెక్టర్

TV4-24X7 News

Leave a Comment