Tv424x7
Andhrapradesh

మధుమణి ఉచిత చెవి ముక్కు గొంతు శస్త్ర చికిత్సల శిబిరం ప్రారంభం

మధుమణి ఆసుపత్రి సేవలు ప్రశంసనీయం : నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్*నంద్యాల మధుమణి నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో గత 33 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఉచిత శస్త్ర చికిత్సల శిబిర ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం మధుమణి నర్సింగ్ హోమ్ సమావేశ భవనంలో జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ , తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెదుర్ల రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారుఈ సందర్భంగా ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ అధ్యక్షతన జరిగిన సభా కార్యక్రమంలో శిబిర నిర్వాహకులు డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ నాగమణి, డాక్టర్ మణిదీప్ మాట్లాడుతూ వారం రోజులలో యభై లక్షల విలువ చేసే వందకు పైగా చెవి, ముక్కు, గొంతు శస్త్ర చికిత్సలను పూర్తి ఉచితంగా చేస్తున్నామని, వారం రోజులపాటు ఓపీ సేవలు ఉచితంగా అందించి మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు . ఈ వారం రోజుల పాటు నిర్వహించే శస్త్ర చికిత్సలను తమతోపాటు దేశంలో పేరెన్నిక గన్న చెవి ముక్కు గొంతు నిపుణులు పాల్గొని చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ గారు మాట్లాడుతూ వరుసగా 33 సంవత్సరాల పాటు ఉచిత శస్త్ర చికిత్సల శిబిరం నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. డాక్టర్ మధుసూదన రావు నంద్యాలలో కోట్లాది రూపాయల విలువ చేసే అత్యంత ఆధునిక పరికరాలతో నగరాలలోని కార్పొరేట్ స్థాయి వసతులతో ఆసుపత్రి ఏర్పాటుచేసి సాధారణ ప్రజానీకానికి అందుబాటులో వైద్యం అందించడం అభినందించదగిన విషయమన్నారు. పేదలకు ఖరీదైన ఉచిత శస్త్ర చికిత్సల సేవలు అందించడం ఈ ప్రాంత ప్రజలకు గొప్ప వరం అన్నారు. రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ మధుమణి ఆసుపత్రి సేవలు, డాక్టర్ మధుసూదన్ రావు సామాజిక ,వైద్య, విద్యా సేవలు వైద్యులందరికీ ఆదర్శప్రాయం అన్నారు . అనంతరం మధుమణి ఆసుపత్రి తరుపున అతిధులను ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో నంద్యాల 12వ వార్డు కౌన్సిలర్ కంటే శ్యామ్ సుందర్ లాల్, డాక్టర్ నాగమణి, డాక్టర్ మణిదీప్, డాక్టర్ రోహిత్, నంద్యాల ఐఎంఏ నాయకులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ జఫరుల్లా, మాజీ కౌన్సిలర్ మిద్దె చిన్న ఉసేని , గాలి చంద్రశేఖర్ , దీపక్ రెడ్డి , సుధాకర్ , అలీ మరియు మధుమణి కుటుంబ సభ్యులు డాక్టర్ మధు ప్రీతి ,సింధూ, బొగ్గరపు నాగరాజు ఉచిత శస్త్ర చికిత్స శిబిరంలో ఆపరేషన్ చేయించుకోబోయే ప్రజలు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

అధికారులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్

TV4-24X7 News

వైఎస్ఆర్‎కు ఘన నివాళి.. జగన్, షర్మిలతో తల్లి విజయమ్మ.

TV4-24X7 News

కుక్క కరిస్తే రూ.20వేలు పరిహారం హైకోర్టు అదేశాలు

TV4-24X7 News

Leave a Comment