నంద్యాల సలీం నగర్ నందు పర్యటించిన నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్
నంద్యాల .. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల సలీం నగర్ చాలా తీవ్రంగా నష్టపోయిందని చుక్క వర్షం కురవక పోయిన సలీం నగర్ ఇళ్లల్లోకి మురికి నీరు ప్రవహిస్తుండటంతో ప్రజలు తరుచూ రోగాల బారిన పడుతున్నారని నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ నంద్యాల పట్టణం 35వ వార్డు సలీం నగర్ ప్రియాంక నగర్ నందు వార్డు పర్యటనలో చేపట్టడంతో వార్డు నాయకులు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు . అనంతరం ఎన్ఎండి ఫిరోజ్ గారు మున్సిపల్ అధికారులు సచివాలయ సిబ్బందితో కలిసి వార్డు మొత్తం కలియ తిరిగి ప్రజల నుండి నేరుగా సమస్యలు తెలుసుకున్నారుఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ సలీం నగర్ వార్డులో కుప్పలు తెప్పలుగా చెత్త పేరుకుపోయిందని, కాలువలు సీల్ట్ తో నిండిపోయి మురికి నీరు రోడ్ల పై ప్రవహిస్తుందని, వార్డులో ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకుపోయి కంప చెట్లు పెరిగిపోయి అక్కడ మురికి నీరు నిల్వ ఉండటంతో దోమలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలు డెంగీ మలేరియా వ్యాధుల బారిన పడుతున్నారన్నారు . వార్డులో వీధి దీపాలు లేకపోవడంతో ప్రజలు రాత్రుళ్ళు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని . అదే విధంగా పద్మావతినగర్ రోడ్డు పై స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో బైకు మీద ప్రయాణిస్తున్న వారు క్రింద పడిపోతున్నారని ప్రజలు ఎన్ఎండి ఫిరోజ్ గారికి దృష్టికి తీసుకువచ్చారు .ఈ సమస్యలన్నిటిని ప్రశాంతంగా విని ఎన్ఎండి ఫిరోజ్ గారు సానుకూలంగా స్పందించి మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకోని వచ్చి తప్పక పరిష్కరిస్తామని హామీనివ్వడం జరిగింది . అదే విధంగా ప్రభుత్వ అర్బన్ హెల్త్ సెంటర్ ని సందర్శించి అక్కడ నెలకొన్న సమస్యలను రోగులు మరియు వైద్య సిబ్బందితో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. ఆసుపత్రికి కాంపౌండ్ వాల్, మ్యాన్ హోల్స్, మెడికల్ వ్యర్థల నిర్వహణ తదితర సమస్యలను అక్కడికక్కడే ప్రభుత్వ అధికారులకు తెలియజేసి పరిష్కరించాలని కోరారు . ఎన్ఎండి ఫిరోజ్ గారు సమస్యలన్నీ తానే స్వయంగా నేరుగా విని సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తామని హామీనివ్వడంతో వార్డు ప్రజలు తమ సమస్యలు త్వరలో పరిష్కారం అవ్వబోతున్నాయని సంతోషం వ్యక్తం చేసి ఫిరోజ్ గారికి ధన్యవాదములు తెలియజేశారుఈ కార్యక్రమంలో 35వ వార్డు సలీం నగర్ టిడిపి ఇన్చార్జ్ షేక్ నూర్ భాషా , షేక్ సర్దార్ బాషా , రఫీ , అక్బర్ , బాడీ బిల్డర్ నూర్ , ఫారుక్ , మా భాష , ఖదీర్ బాయ్ తదితరులు పాల్గొన్నారు