కడప/ స్థానిక సిద్ధవటం రోడ్డు లోని బిసి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో నేడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశము జరిగింది.
సమావేశములో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి బి. గురుమూర్తి, ఓబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం కే బి ఎన్ ఆర్ సాగర్, బి సి ఇ ఎఫ్ జిల్లా కన్వీనర్ కావేటి.రమేష్ యాదవ్, సామాజిక న్యాయ సమితి కన్వీనర్ శివరామయ్య టిడిపి బద్వేలు బిసి నాయకులు మాజీ సర్పంచ్ వెంకట రమణయ్యయాదవ్, బీసీఇఎఫ్ బద్వేలు అధ్యక్షులు మురళీకృష్ణ ,డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి నాగార్జున,బిసి టెలికాం.నాయకులు బ్రహ్మయ్య ల ఆధ్వర్యంలో ఈనెల 18 ,19 తేదీలలో కడప జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయము లో పూర్వ ఆర్జెడి వై రాఘవ రెడ్డి పై జరుగుతున్న ఎంక్వయిరీ లో పాల్గొంటున్న బాధిత ఉపాధ్యాయులలో ఒకరైన వెలుగోటి వెంకటేశ్వర్లు అనే ఉపాధ్యాయుడిని విచారణలో పాల్గొనకుండా అడ్డుకొని భౌతిక దాడులకు పాల్పడిన పూర్వ ఆర్జెడి అనుచరులు ఆదినారాయణ రెడ్డి మంగంపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, శివకుమార్ రెడ్డి హెచ్ఎం మాసాపేట ఉన్నత పాఠశాల, నాగ మునిరెడ్డి,డి సి ఈ బి సెక్రటరీ అన్నమయ్య జిల్లా,రామకృష్ణ హెచ్ఎం జడ్పీ హైస్కూల్ జాండ్రపల్లె, మరియు వెంకటేష్ నాయక్ సుండుపల్లి మండల విద్యాశాఖ అధికారి , పూర్వ ఆర్జేడి రాఘవరెడ్డికి మద్దతుగా సాక్షాత్తు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయము మరియు రాష్ట్ర ప్రభుత్వం చే రాష్ట్రస్థాయి అధికారి చే విచారణ జరుగుతున్న ప్రాంగణంలోనే ఉపాధ్యాయులపై దాడికి పాల్పడిన వీరు ఉపాధ్యాయ జాతికే కళంకమని మరియు తాము ప్రధానోపాధ్యాయులుగా విద్యాశాఖ అధికారిగా మరియు ఉపాధ్యాయులుగా విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఏ విధమైన బోధన మరియు పర్యవేక్షణ లను చేయగలరని సమాజంలో ఇలాంటివారు ఉపాధ్యాయ వృత్తికే పెద్ద మాయని మచ్చ అని తెలియజేశారు వీరితోపాటు దాడులకు పాల్పడడానికి మూలకారకులు పూర్వ ఆర్జేడి రాఘవరెడ్డి పై శాఖా పరమైన చర్యలతో పాటు, దాడులకు పాల్పడిన ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖ అధికారి పై అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి వారు తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జిల్లా వ్యాప్తంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని ఓ బి సి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం కె బి ఎన్ ఆర్ సాగర్, మరియు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి బి గురుమూర్తి తెలియజేశారు