విశాఖపట్నం మర్రిపాలెం లో గణేష్ స్టార్ గాయ్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో అన్నదానానికి దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ రూ.5 వేలు విరాళం అందజేశారు. ఈ మేరకు శుక్రవారం అమ్మవారి దర్శనం పూజలు చేసారు. దసరా ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను వాసుపల్లి అభినందించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు రామలక్ష్మి, శైలు, దేవి ప్రసాద్, శివ, రవి, సంతోష్, శేఖర్, అజయ్, వినోద్, భరత్, వెంకటేష్ రవితేజ, పవన్ యశ్వంత్ సుమంత్ తదితరులు పాల్గొన్నారు.
