బద్వేలు లో మైనర్ బాలిక ను ప్రేమోన్మాది విఘ్నేష్ ను కఠినంగా శిక్షించాలని, భాదిత విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కడప ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా, DYFI, SFI, రైతు సంఘాల జిల్లా కార్యదర్షులు ఐ.యన్.సుబ్బమ్మ, వీరణాల.శివకుమార్, వీరపోగు.రవి,బి.దస్తగిరి రెడ్డి,సీఐటీయూ జిల్లా, DYFI, SFI జిల్లా అధ్యక్షులు కామనూరు శ్రీనివాసులురెడ్డి ముడియం చిన్ని ఎద్దు రాహుల్ లు మాట్లాడుతూ దేశంలో,రాష్ట్రంలో మహిళల పై నిత్యం దాడులు,అత్యాచారాలు పెరిగి పోతున్నాయని అన్నారు.వీటిని అరికట్టడంలో పాలక ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని అన్నారు.దేశంలో బలమైన చట్టాలు లేకపోవడంతో అనునిత్యం మహిళలు,విద్యార్థినిలు పై అనేక రూపాలలో దాడులు పెట్రేగి పోతున్నాయని అన్నారు.గతంలో నిర్భయ లాంటి చట్టాలు వున్న అవి కాగితాలకే పరిమితం అవుతున్నాయని అన్నారు.బద్వేలు లో జరిగిన సంఘటన సభ్య సమాజం సిగ్గు పడేలా వున్నదని అన్నారు.బాధితురాలు కుటుంబానికి 50 లక్షల రూపాయలు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని,ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని,ప్రేమోన్మాది విఘ్నేష్ నీ కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు గా డిమాండ్ చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం డేవిడ్ రాజ్ రెబ్బ నరసింహలు జిల్లా సహాయ కార్యదర్శి ఆది తులసిశ్వర్ యాదవ్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

previous post