Tv424x7
Andhrapradesh

నీలాపు సర్వేశ్వర్ రెడ్డిని పరామర్శించిన వాసుపల్లి

విశాఖపట్నం 27వార్డు వైసిపి అధ్యక్షుడు నీలాపు సర్వేశ్వర రెడ్డి నీ మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ పరామర్శించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వివేకానంద హాస్పటల్లో చికిత్స పొందుతున్న నీలాపు సర్వేశ్వర్ రెడ్డిని మంగళవారం ఉదయం వైసీపీ శ్రేణులతో కలిసి పలకరించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, త్వరగా కోలుకోవాలని వాసుపల్లి గణేష్కుమార్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు, తన వెంట ఉండే నాయకులకు కార్యకర్తలకు అండగా ఉండటం తన బాధ్యత అన్నారు. అదేవిధంగా వారి కష్టనష్టాలలో ఈ వాసుపల్లి గణేష్ కుమార్ ఎప్పుడు తోడుగా ఉంటాడని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో 29వ వార్డు అధ్యక్షులు పీతల వాసు, 31వ అధ్యక్షులు బాపు ఆనంద్, 35వ వార్డు అధ్యక్షులు కనకా రెడ్డి ,దక్షిణ నియోజకవర్గం మైనార్టీ అధ్యక్షులు ముజీబ్ ఖాన్, తాడి రవితేజ , బుజ్జి, రామరాజు, ఆకుల శ్యామ్, మరియు తదితరులు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.

Related posts

బాబు షూరిటీ భవిషత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న పుట్టా

TV4-24X7 News

ఏపీలో త్వరలో ఎస్సీలకు రూ.50,000 రాయితీతో రుణాలు

TV4-24X7 News

ప్రధాని నివాసానికి బయలుదేరిన కిషన్ రెడ్డి, బండి సంజయ్తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్‌లో సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి చోటు దక్కింది. పీఎంవో నుంచి సాయంత్రం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయాలంటూ ఇద్దరి నేతలకు ఫోన్‌ వచ్చింది. దీంతో ఢిల్లీలోని కిషన్‌రెడ్డి నివాసం నుంచి బండి సంజయ్‌ ఒకే కారులో ప్రధాని నివాసానికి బయలుదేరారు. ముందుగా అక్కడ జరిగే తేనేటి విందుకు హాజరై ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లనున్నారు.

TV4-24X7 News

Leave a Comment