విశాఖపట్నం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న మహిళా పోలీసులు అందరితో సోమవారం సీఐ జి.డి .బాబు సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా మహిళా పోలీసులతో మాట్లాడుతూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి నేరాలు జరగకూడదని, గంజాయి మత్తు పదార్థాలను సేవించే వారి,బెల్ట్ షాప్స్ను నిర్వహించే వారి వివరాలను, మత్తు పదార్థాలను, చాలామంది యువకులు సేవించి నేరాలు చేస్తున్నారని కాబట్టి, అసాంఘిక శక్తులు వివరాలను సేకరించాలన్నారు. ఎవరైనా ప్రజా శాంతికి భంగం కలిగించేటట్లుగా ఉన్నట్లయితే వారి సమాచారాన్ని తెలియజేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎటువంటి నేరాలు జరగకుండా, ముందస్తు సమాచారం సేకరణ చేయాలని తగిన సహాయ సహకారాలను అందించాలన్నారు.

previous post