Tv424x7
Andhrapradesh

పుర్రి దుర్గాప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించిన వాసుపల్లి

విశాఖపట్నం దక్షిణ పేద ప్రజలకు తానున్నానంటూ దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, వైసిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ చెయ్యందిస్తున్నారు. అధికారంలో లేకున్నా ఆగని సాయం దక్షిణ ప్రజలకు అండగా నిలుస్తున్నాయి. వారికి కష్టమైనా, పండగ అయినా, శుభకార్యమైన దక్షిణ ప్రజలకు ముందుగా గుర్తొచ్చేది వాసుపల్లి గణేష్ కుమార్ మాత్రమే. వారి ఆహ్వానం మేరకు కార్యక్రమానికి హాజరై భరోసాగా నిలబడుతున్నారు. 35 వార్డులో ఇటీవల చనిపోయిన పుర్రి దుర్గాప్రసాద్ పెద్దకర్మ కార్యక్రమానికి హాజరై ఆ కుటుంబాన్ని ఓదార్చారు. అలాగే తన వంతు సాయంగా రూ.10 వేలు అందజేశారు. అందువచ్చిన కొడుకు దూరం కావడం చాలా బాధాకరమన్నారు. పుర్రి దుర్గాప్రసాద్ ఆత్మకు శాంతి కలగాలని, ఆ కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని వాసుపల్లి గణేష్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు, మృతుడి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Related posts

వైసీపీకి రాజీనామా చేసిన సినీ నటుడు అలీ

TV4-24X7 News

కేంద్ర హోమ్ శాఖ ను మర్యాదపూర్వకంగా కలిసినా చొక్కాకుల రాంబాబు

TV4-24X7 News

ఎస్సీ ఎస్టీలకు క్షమాపణ చెప్పండి జగన్ కు షర్మిల బహిరంగ లేఖ

TV4-24X7 News

Leave a Comment